Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అమిత్ షా కీలక భేటీ.. సమావేశానికి వైకాపా వ్యూహకర్త

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ పార్టీ అధినేత అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన ఏపీకి చెందిన పార్టీ నేతలను ఢిల్లీకి పిల

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (18:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ పార్టీ అధినేత అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన ఏపీకి చెందిన పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని శనివారం కీలక మంతనాలు జరిపారు. అయితే, ఈ సమావేశానికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌ హాజరుకావడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. అవిశ్వాస తీర్మానం, ఏపీకి కేంద్ర సర్కారు చేసిన సహాయంపై చర్చించినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు కంటే ఎక్కువ నిబద్ధతతో ఉన్నామన్నారు. భవిష్యత్‌లోనూ ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అమిత్ షా‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాంమాధవ్.. సెంటిమెంట్‌కు అభివృద్ధితోనే సమాధానం చెబుతామన్నారు. ఇప్పటివరకూ చంద్రబాబు ప్రశ్నలు వేస్తున్నారు.. వాటన్నింటికీ సమాధానం చెబుతామని, అదేవిధంగా తాము అడిగే ప్రశ్నలకూ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments