Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరవకొండలో ఘోరం : ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (07:54 IST)
అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం, బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఓ శుభకార్యానికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషురులు ఉన్నారు.
 
కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. మృతులు ఉరవకొండ మండలం, నిమ్మగల్లు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ప్రమాదస్థలం శోకసముద్రంలా మారింది. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో బీజేపీ కిసాన్ రాష్ట్ర నేత కోకా వెంకటప్ప కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments