ఉరవకొండలో ఘోరం : ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (07:54 IST)
అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం, బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఓ శుభకార్యానికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషురులు ఉన్నారు.
 
కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. మృతులు ఉరవకొండ మండలం, నిమ్మగల్లు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ప్రమాదస్థలం శోకసముద్రంలా మారింది. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో బీజేపీ కిసాన్ రాష్ట్ర నేత కోకా వెంకటప్ప కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments