3వ తేదీ నిమ్మగడ్డ అరంగేట్రం, ఆ నిర్ణయం తీసేసుకుంటారా..?

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (21:28 IST)
నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. బలమైన ప్రభుత్వంపై పోరాటం చేసి చివరకు విజయం సాధించారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రభుత్వం బేఖాతరు చేసింది. చివరకు గవర్నర్ ఆదేశాలతో ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్నికల కమిషనర్‌గా నియమించింది.
 
అర్థరాత్రి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేస్తారోనన్నది ఆసక్తికరంగా మారుతోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం సిఎంకు ఏ మాత్రం ఇష్టం లేదు. 
 
దీంతో చివరకు చెన్నై నుంచి కనకరాజ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఆ తరువాత రాజకీయ దుమారం రేగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్ళారు. ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. చివరకు కోర్టు గవర్నర్‌కు సూచిస్తే ఆయన్ను కలిశారు.
 
చిట్టచివరకు గవర్నర్ ఆదేశాలతోనైనా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగష్టు 3వ తేదీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆశక్తికరంగా మారుతోంది. కరోనా వైరస్ సమయంలో స్థానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసి వైసిపి నేతలకు మింగుడు పడకుండా చేసిన నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇరకాటంలో పెడుతారోనన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments