Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కర్ఫ్యూ ఎత్తివేతకు సీఎం జగన్ నిర్ణయం?

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (12:56 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూ సడలింపులను పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. 
 
అయితే, కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానిక టాస్క్ ఫోర్స్ కమిటీలు మధ్యాహ్నం నుంచే ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీతో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ గడువు ముగియనుండటంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 
 
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోంది. అలాగే రోజువారీ కేసులు తగ్గుతున్నాయి. కొన్ని జిల్లాలో రోజుకు 50-100 లోపు కేసులు నమోదవుతుండగా.. ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే సగటున 300 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
దీన్ని దృష్టిలో ఉంచుకొని పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కొనసాగించి.. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పూర్తిస్థాయిలో ఎత్తేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments