Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో బాధితుడు జగన్ హాజరుకావాల్సిందే : ఎన్.ఐ.ఏ కోర్టు

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (11:19 IST)
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో ఓ వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) చేపట్టగా, కేసు విచారణ కూడా ఎన్.ఐ.ఏ కోర్టులో సాగుతోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో ఎన్.ఐ.ఏ విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. వచ్చే నెల పదో తేదీన విచారణకు రావాలని బాధితుడు జగన్మోహన్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ నాగేశ్వర రెడ్డి కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 
 
మరోవైరపు, మంగళవారం ఇదే కేసులో విశాఖ ఎయిర్‌పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్‌ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పోలీసులు కోడికత్తిని, మరో చిన్న కత్తిని కోర్టుకు అప్పగించారు. అలాగే, ఈ కేసుకు సంబంధించిన ఓ సెల్‌ఫోన్, పర్సును కూడా ఎన్ఐఏ ధర్మాసనానికి అందించారు. అనంతరం, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున బాధితుడైన సీఎం జగన్ తప్పుకుండా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments