Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి రోజున జరిగిన గొడవ.. నవదంపతులు మృతి.. పెళ్లికూతురైతే?

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:56 IST)
పెళ్లి రోజున జరిగిన గొడవలో ఓ నవ దంపతులు తీవ్ర గాయాలపాలై మరణించిన విషాద సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది. కోలార్ జిల్లా, కేజీఎఫ్ తాలూకాలోని చంబరసనహళ్లి గ్రామంలో జరిగిన వివాహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన వధువు లిఖితశ్రీ అక్కడికక్కడే మృతి చెందగా, వరుడు నవీన్ చికిత్స విఫలమై గురువారం మృతి చెందాడు. చంబరసనహళ్లిలో నివాసముంటున్న నవీన్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బైనపల్లి గ్రామానికి చెందిన లిఖితశ్రీలు కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 
 
తల్లిదండ్రుల నుంచి మొదట్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బుధవారం ఉదయం కుటుంబీకుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం నవ వధువు వెళ్లిన బంధువుల ఇంట్లో అదేరోజు సాయంత్రం గొడవ జరిగింది. 
 
చిన్నపాటి అభిప్రాయభేదాలతో మొదలైన ఈ వివాదం ఘర్షణగా మారింది. ఈ ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన లిఖితశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. నవీన్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో వెంటనే కోలారు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
 
అనంతరం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎంత ప్రయత్నించినా నవీన్‌ను కాపాడలేకపోయామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అండర్సన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments