Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన మూడో రోజు ప్రియుడితో లేచిపోయిన నవ వధువు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (08:30 IST)
తనకు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఓ నవ వధువు వివాహమైన మూడో రోజే తన ప్రియుడితో లేచిపోయింది. ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో జరిగింది. దీన్నీ జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
జిల్లాలోని మాధవరం గ్రామానికి చెందిన ఓ యువతికి పొరుగూరుకు చెందిన ఓ యువకుడితో ఈ నెల 9వ తేదీన ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఘనంగా వివాహం జరిపించారు. అయితే, మాధవరం గ్రామానికి చెందిన శివాజీ అనే యువకుడితో యువతి పీకల్లోతు ప్రేమలో ఉంది. పెద్దల ఒత్తిడితో ఈ పెళ్లికి ఆమె బలవంతంగా అంగీకరించింది. అదేసమయంలో తన ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. 
 
ఈ క్రమంలో పెళ్లి అయిన మూడో రోజే వధువు ప్రియుడు శివాజీతో కలిసి ఊరువదిలి పారిపోయింది. ఈ విషయం తెలిసిన వధువు బంధువులు ఆదివారం రాత్రి మాధవరం చేరుకుని శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశారు. అలాగే, శివాజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments