Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన మూడో రోజు ప్రియుడితో లేచిపోయిన నవ వధువు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (08:30 IST)
తనకు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఓ నవ వధువు వివాహమైన మూడో రోజే తన ప్రియుడితో లేచిపోయింది. ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో జరిగింది. దీన్నీ జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
జిల్లాలోని మాధవరం గ్రామానికి చెందిన ఓ యువతికి పొరుగూరుకు చెందిన ఓ యువకుడితో ఈ నెల 9వ తేదీన ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఘనంగా వివాహం జరిపించారు. అయితే, మాధవరం గ్రామానికి చెందిన శివాజీ అనే యువకుడితో యువతి పీకల్లోతు ప్రేమలో ఉంది. పెద్దల ఒత్తిడితో ఈ పెళ్లికి ఆమె బలవంతంగా అంగీకరించింది. అదేసమయంలో తన ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. 
 
ఈ క్రమంలో పెళ్లి అయిన మూడో రోజే వధువు ప్రియుడు శివాజీతో కలిసి ఊరువదిలి పారిపోయింది. ఈ విషయం తెలిసిన వధువు బంధువులు ఆదివారం రాత్రి మాధవరం చేరుకుని శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశారు. అలాగే, శివాజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments