పెళ్లయిన మూడో రోజు ప్రియుడితో లేచిపోయిన నవ వధువు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (08:30 IST)
తనకు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఓ నవ వధువు వివాహమైన మూడో రోజే తన ప్రియుడితో లేచిపోయింది. ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో జరిగింది. దీన్నీ జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
జిల్లాలోని మాధవరం గ్రామానికి చెందిన ఓ యువతికి పొరుగూరుకు చెందిన ఓ యువకుడితో ఈ నెల 9వ తేదీన ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఘనంగా వివాహం జరిపించారు. అయితే, మాధవరం గ్రామానికి చెందిన శివాజీ అనే యువకుడితో యువతి పీకల్లోతు ప్రేమలో ఉంది. పెద్దల ఒత్తిడితో ఈ పెళ్లికి ఆమె బలవంతంగా అంగీకరించింది. అదేసమయంలో తన ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. 
 
ఈ క్రమంలో పెళ్లి అయిన మూడో రోజే వధువు ప్రియుడు శివాజీతో కలిసి ఊరువదిలి పారిపోయింది. ఈ విషయం తెలిసిన వధువు బంధువులు ఆదివారం రాత్రి మాధవరం చేరుకుని శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశారు. అలాగే, శివాజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments