Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మత్తు మందు కలిపిన అన్నం పెట్టి ప్రియుడితో జంప్

lovers
, గురువారం, 9 జూన్ 2022 (12:27 IST)
75 ఏళ్ల వృద్ధురాలు మూడు రోజుల పాటు ఇంటి నుంచి బయటికి రాలేదు. స్థానికులు అనుమానంతో కిటికీల నుంచి చూస్తే షాక్. ఆమె స్పృహ తప్పి పడివుండటం చూశారు. అంతే పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు ఈ వ్యవహారంపై ఆరాతీశారు. వృద్ధురాలి పెద్ద కుమారుడికి కొంతకాలం క్రితం వివాహం జరిగిందని.. ఇప్పుడా కొత్త కోడలు కనబడడం లేదని తేలింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలోని జునేద్‌పూర్ గ్రామంలో జరిగింది కోడలు అంతకుముందు రోజు వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులంతా తిన్నారు. అంతే ఆ తర్వాత ఏమైందో తెలియదని చెప్పారు.
 
పోలీసులు ఆరా తీయగా.. సదరు ఇల్లాలు చేసిన దారుణం బయటపడింది. కుటుంబంలో అందరికీ మత్తుమంది పెట్టిన ఆమె, పక్కింట్లో ఉండే ప్రియుడితో కలిసి పరారైంది. 
 
కొంతకాలంగా వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తేలింది. ఆ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదరు ఇల్లాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు: నిద్రలోనే గంగాధర్‌ రెడ్డి మృతి