Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మడ్ బాత్ మసాజ్ పేరుతో మభ్యపెట్టి.. భర్త ఎదుటే బ్రిటన్ మహిళపై అఘాయిత్యం

victim
, బుధవారం, 8 జూన్ 2022 (09:59 IST)
గోవాలో బ్రిటన్‌కు చెందిన మహిళపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. గోవా సముద్ర పర్యాటక అందాలు తిలకించేందుకు వచ్చిన బ్రిటన్‌ మహిళను శరీర మర్దన చేసే నెపంతో స్థానిక యువకుడు ఒకరు ఆమె ప్రియుడి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఉత్తర గోవా జిల్లాలోని అరంబోల్‌ బీచ్‌ వద్ద విన్సెంట్‌ సహా మరికొందరు అనుమతి లేకుండా మసాజ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యవయస్కురాలైన బ్రిటిష్‌ మహిళ తన భర్తతో కలసి ఈ నెల 2న బీచ్‌ సమీపంలోని స్వీట్‌ వాటర్‌ సరస్సు వద్దకు వచ్చింది. ఆ సమయంలో విన్సెంట్‌ మసాజ్‌ చేయించుకోవాలని కోరగా వారు అంగీకరించారు. 
 
ఆ తర్వాత బాధితురాలికి మర్దన చేస్తున్నట్లు నటిస్తూ ప్రియుడి ముందే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణాన్ని ఆ మహిళ బ్రిటన్‌లోని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. భారత్‌లోని బ్రిటిష్‌ ఎంబసీ సహాయాన్ని అర్థించింది. వారి సూచన మేరకు సోమవారం పెర్నెమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మసాజ్ పేరుతో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు విన్సెంట్‌ డిసౌజా(32)ను అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్, ప్రభుత్వ వాహనంలోనే అత్యాచారం: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడి