Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో సూర్యుడి ప్రతాపం.. పదేళ్ళనాటి బండరాయి పగిలిపోయింది!

Webdunia
సోమవారం, 30 మే 2016 (09:41 IST)
వేసవికాలం మంటెక్కిపోతోంది. భానుడి తీవ్రతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఠారెత్తిపోతున్నారు. కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఫలితంగా.. తెలంగాణ ప్రజలు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలకు తోడుగా వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్నా కూడా సూర్యతాపాన్ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. సాయంత్రం ఏడు గంటలైనా వాతావరణం చల్లబడడం లేదు. 
 
కాగా రోహిణి కార్తెలో కాసే ఎండలకు రోళ్లు పగులుతాయని సామెత ఉంది. ఇప్పుడది సాక్షాత్తుగా నిజమైంది. భానుడి ప్రతానికి రోళ్లు కాదు పెద్ద కంకుల గుండు నిలువునా ముక్కలైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం ముస్తాపురంలో దశాబ్దాల క్రితం నాటి కంకులు గుండు ఎండలకు రెండు ముక్కలైంది. కాగా నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, మర్రిపాడు, ఉదయగిరి, అనంతసాగరం ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments