Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ హీటెక్కిన సింహపురి పాలిటిక్స్... ఆనం వర్సెస్ నేదురుమల్లి

Webdunia
గురువారం, 25 మే 2023 (11:56 IST)
సింహపురి పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. ఎన్నికలకు ముందే సింహపురిలో వాతావరణం హీటెక్కింది. ఈసారి రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వర్సెస్‌ నేదురుమల్లి కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజాగా మౌనం వీడారు. 
 
గత మూడు నెలలుగా రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆనం ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గంలో సంచలన కామెంట్స్ చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆనం… చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే, తానూ అక్కడి నుంచే బరిలో దిగుతానని కామెంట్‌ చేశారు. 
 
అంతేగాకుండా 60 శాతం ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని హాట్‌ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ వెంకటగిరి ఇంఛార్జ్‌గా ఉన్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఆనం కామెంట్స్‌పై కౌంటర్‌ ఇచ్చారు. 60 శాతం కాదు కదా, ఆరుగు కూడా  వైకాపాను వీడే ప్రసక్తే లేదన్నారు. 
 
ఆత్మకూరులో కాదు…ఆనంకు దమ్ముంటే వెంకటగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఈ సవాలుపై ఆనం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments