Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తుతెలియని ప్రాంతానికి ఆనందయ్య - బంధువుల ఆందోళన

Webdunia
గురువారం, 27 మే 2021 (10:57 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బోణిగి ఆనందయ్యను నెల్లూరు జిల్లా పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. గత నాలుగైదు రోజులుగా కృష్ణపట్నం గోపాలపురం సీవీఆర్ అకాడమీ నుంచి ఆనందయ్యను పోలీసులు తరలించారు. ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారో పోలీసులు స్పష్టం చేయడం లేదు. 
 
దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఆనందయ్య గురించి ఏ సమాచారం లేకపోవడంతో బంధువులు పోలీసులను నిలదీస్తున్నారు. 
 
మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అంబులెన్సుల్లో వచ్చేవారికి కూడా అనుమతి నిరాకరిస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. 
 
మరోవైపు, పోలీసుల వలయంలో ఉన్న ఆనందయ్యతో ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేతలు దొంగచాటుగా మందు తయారు చేయించుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆనందయ్యను సీవీఆర్ అకాడెమీ నుంచి మరో ప్రాంతానికి పోలీసులు గురువారం తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments