Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తుతెలియని ప్రాంతానికి ఆనందయ్య - బంధువుల ఆందోళన

Webdunia
గురువారం, 27 మే 2021 (10:57 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బోణిగి ఆనందయ్యను నెల్లూరు జిల్లా పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. గత నాలుగైదు రోజులుగా కృష్ణపట్నం గోపాలపురం సీవీఆర్ అకాడమీ నుంచి ఆనందయ్యను పోలీసులు తరలించారు. ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారో పోలీసులు స్పష్టం చేయడం లేదు. 
 
దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఆనందయ్య గురించి ఏ సమాచారం లేకపోవడంతో బంధువులు పోలీసులను నిలదీస్తున్నారు. 
 
మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అంబులెన్సుల్లో వచ్చేవారికి కూడా అనుమతి నిరాకరిస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. 
 
మరోవైపు, పోలీసుల వలయంలో ఉన్న ఆనందయ్యతో ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేతలు దొంగచాటుగా మందు తయారు చేయించుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆనందయ్యను సీవీఆర్ అకాడెమీ నుంచి మరో ప్రాంతానికి పోలీసులు గురువారం తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments