Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Webdunia
గురువారం, 27 మే 2021 (10:56 IST)
సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గురువారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. 
 
ఈ ఘటన మునగాల మండలంలోని మాధవరం శివారులో చోటు చేసుకుంది. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
మృతులు కోదాడ సాలర్జంగ్‌పేటకు చెందిన గాధరి ఫ్రాన్సిస్ (56), ఎల్లమ్మ (53)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సాలర్జంగ్‌పేటలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments