Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో పోలీసుల అక్రమ వసూళ్లు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (12:12 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో పోలీసులు బరితెగించారు. చిరు, బడా వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనదారులు, వ్యాపారులు, ఆటోవాళ్లు, రిక్షావాళ్లు, కూలీలు.. ఇలా ఎవరినీ పోలీసులు వదలడంలేదు. రౌడీలకంటే ఘోరంగా నడి రోడ్డుపై డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. బాధితులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
నెల్లూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య అతి ప్రధాన సమస్యగా ఉంది. పగలు లారీలు, మరికొన్ని వాహనాలు రాకపోకలపై నిషేధం ఉంది. అయితే లారీలు, సరుకుల ఆటోలు నగరంలోకి వస్తున్నాయి. ట్రాఫిక్ తీవ్రంగా ఉండే రోడ్లలో అడ్డంగా నిలిపేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 
 
పోలీసులు వాటిని నిలువరించాల్సిందిపోయి.. ఒక్కో వాహనం నుంచి వంద నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. రోడ్లపై చిరు వ్యాపారులను కూడా వదలడంలేదు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. షాపుల ఎదుట వాహనాలు అడ్డంగా ఉన్నాయంటూ వ్యాపారులను పిండేస్తున్నారు. 
 
హోటళ్ల వంటి వారి వద్ద నెల మామూలు గుంజుతున్నారు. ఒక్కో ఆటోకు రోజుకు వంద, రిక్షాలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో పోలీసులు వస్తున్నారంటేనే జనం హడలిపోతున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో సగం మామూళ్లకే సరిపోతున్నాయని సామాన్యులు బోరున విలపిస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments