Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిన లెక్చరర్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (11:04 IST)
తన వద్ద చదువుకునే అమ్మాయిలకు వల వేశాడో లెక్చరర్. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది అమ్మాయిలను ఆ కామాంధ లెక్చరర్ ట్రాప్ చేశాడు. చివరకు పాపం పండి.. ఓ యువతి దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ లెక్చరర్ బండారం బయటపడింది. ఇది నెల్లూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే అమ్మాయిలపై కన్నేశాడు. అలా 15 మందిని ట్రాప్ చేసి ప్రేమ పాఠాలు వల్లించసాగాడు. ఈ క్రమంలో ఓ యువతి మొబైల్ నంబరు తీసుకుని అసభ్యకర చాటింగ్ చేస్తూ, అశ్లీల ఫోటోలు పంపసాగాడు. 
 
అంతేకాకుండా, తనతో సన్నిహితంగా మెలగాలనీ, శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేయసాగాడు. అలాగే, ఇతర విద్యార్థినిల వద్ద కూడా ఇదేవిధంగా నడుచుకోసాగాడు. అయితే, ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ బాధిత విద్యార్థిని నెల్లూరులో దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments