Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిన లెక్చరర్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (11:04 IST)
తన వద్ద చదువుకునే అమ్మాయిలకు వల వేశాడో లెక్చరర్. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది అమ్మాయిలను ఆ కామాంధ లెక్చరర్ ట్రాప్ చేశాడు. చివరకు పాపం పండి.. ఓ యువతి దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ లెక్చరర్ బండారం బయటపడింది. ఇది నెల్లూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే అమ్మాయిలపై కన్నేశాడు. అలా 15 మందిని ట్రాప్ చేసి ప్రేమ పాఠాలు వల్లించసాగాడు. ఈ క్రమంలో ఓ యువతి మొబైల్ నంబరు తీసుకుని అసభ్యకర చాటింగ్ చేస్తూ, అశ్లీల ఫోటోలు పంపసాగాడు. 
 
అంతేకాకుండా, తనతో సన్నిహితంగా మెలగాలనీ, శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేయసాగాడు. అలాగే, ఇతర విద్యార్థినిల వద్ద కూడా ఇదేవిధంగా నడుచుకోసాగాడు. అయితే, ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ బాధిత విద్యార్థిని నెల్లూరులో దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments