Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త తుదిశ్వాస విడిచిన నాలుగు గంటల్లో భార్య మృతి

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (14:21 IST)
నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులో ఓ విషాదకర సంఘటన జరిగింది. భర్త తుదిశ్వాస విడిచిన కేవలం నాలుగు గంటల్లోనే భార్య కూడా కన్నుమూసింది. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మండలంలోని నరుకూరులో ఈ విషాదకర ఘటన బుధవారం జరిగింది.
 
నరుకూరుకు చెందిన రమణ (40), సుమలత (36) అనే దంపతులు జీవిస్తున్నారు. డ్యాన్సర్‌గా రమణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్థానికుల మన్ననలు పొందారు. 
 
కొద్ది రోజుల క్రితం దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. వారం రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నై తరలించారు. భర్త చికిత్స పొందుతున్న సమయంలో సుమలత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 
 
మంగళవారం రమణను చెన్నై నుంచి నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. నరుకూరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించిన నాలుగు గంటల వ్యవధిలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమలత మరణించింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments