Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు కొండాపురంలో బాలికపై అత్యాచారం

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (15:26 IST)
నెల్లూరు జిల్లా కొండాపురంలో ఓ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా కొండాపురంలోని అరుంధతివాడలో ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. స్థానికంగా ఎలాంటి దుకాణాలు లేకపోవడంతో చిన్నవస్తువు కావాలాన్నా పక్కనే ఉన్న రామానుజపురంకు వెళ్లాల్సిందే. 
 
అదే ఆ మైనర్ బాలికపట్ల పాలిట శాపంగా మారింది.గురువాతం రాత్రి భోజన సమయానికి ఇంట్లో పెరుగు లేకపోవడంతో తల్లిదండ్రులు పెరుగు ప్యాకెట్ తీసుకురావాలని బాలికను రామానుజపురానికి పంపించారు. 
 
బాలిక షాపుకెళ్లి పెరుగుప్యాకెట్ తీసుకొని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఉండగా గ్రామంలో కరెంట్ పోయింది. అప్పటికే బాలికపై కన్నేసిన నలుగురు యువకులు.. ఆమెను ఊరిచివర ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు. బాలిక కేకలు వేయకుండా నోటిలో గుడ్డలు కుక్కేశారు. కాళ్లు చేతులు కట్టేసి బాలికను వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఇంతలో బాలిక మూలుగులు విన్న స్థానికులు చెరువుకట్టవైపున‌కు వెళ్లగా ఆ యువకులు పారిపోయేందుకు యత్నించారు. వీరిలో ఒకరిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ మరో ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments