నెల్లూరు నీట మునక : ప్రమాదకరంగా జలాశయాలు - ఉధృతంగా పెన్నానది

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (13:30 IST)
నెల్లూరు జిల్లా నీట మునిగింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న కుండపోత వర్షాలలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకునివున్నాయి. ఈ జిల్లాలోని అన్ని జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. వీటిలో అనేకం ప్రమాదకరంగా ఉన్నాయి. కట్టలు తెగి ఎపుడు ఊర్లపై పడుతాయోనన్న ఆందోళనలో స్థానిక ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
ముఖ్యంగా, జిల్లాలోని కండలేరు, సోమశిల డ్యామ్‌ల నుంచి భారీ మొత్తంలో నీటిని కిందికి విడుదల చేశారు. దీనికితోడు వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పొలాలన్నీ నీట మునిగివున్నాయి. 
 
అలాగే, ఇళ్లచుట్టూత నీళ్లు వచ్చిచేరాయి. ఎటు చూసినా నీళ్లు కంటికి కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. దీంతో మూగ జీవాలు మేత లేక అల్లాడుతున్నాయి. ఈ జిల్లాలోని జాతీయ రహదారి 16పై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. 
 
ప్రస్తుతం సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. జలాశయానికి 96569 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 115396 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలివేశారు. దీంతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)

జై హో పాటపై ఆర్జీవీ కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్‌ వ్యాఖ్యలపై వర్మ ఎండ్ కార్డ్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments