Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు దంపతుల హత్య కేసులో హోటల్ సప్లయరే హంతకుడు

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:20 IST)
ఇటీవల జిల్లా కేంద్రమైన నెల్లూరులో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యలు నెల్లూరు పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ కేసులో హంతకులను పోలీసులు గుర్తించారు. మృతుడైన హోటల్ యజమాని హోటల్‌లో పని చేసే సప్లయరే ఈ హత్యకు పాల్పడినట్టు తేల్చారు. ఈ సప్లయర్‌కు మృతుడు బంధువు ఒకరు తన వంతు సహకారం అందించారు.
 
నెల్లూరు పట్టణానికి చెందిన కృష్ణారావు (54), సునీత (50) అనే దంపతులు ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటరులో కృష్ణారావు హోటల్ నడుపుతున్నారు. ఈ నెల 27వ తేదీన అర్థరాత్రి సమయంలో కృష్ణారావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. 
 
మరుసటి రోజు ఉదయం పాలు పోసేందుకు వచ్చిన రమణమ్మ అనే మహిళ కృష్ణారావు మృతదేహాన్ని చూసేంత వరకు ఈ హత్య కేసు వెలుగులోకి రాలేదు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేస విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు వాస్తవం తెలిసింది. 
 
కృష్ణారావు హోటల్‌లో సప్లయర్‌గా పని చేసే శివ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. దీనికి కారణం శివను నలుగురు ముందు కృష్ణారావు దూషించడమే. దీంతో పగతో రగిలిపోయిన శివ... కృష్ణారావును పగతీర్చుకోవడంతో పాటు డబ్బు కోసం కృష్ణారావు, ఆయన భార్య సునీతను హత్య చేశాడు. 
 
శివకు కృష్ణారావు బంధువు రామకృష్ణ తన వంతు సహకారం అందించారు. శివ, రామకృష్ణలు కలిసి కృష్ణారావు గొంతు కోశారు. ఆ తర్వాత నిద్రిస్తున్న సునీత తలపై బలంగా కొట్టి చంపేశారు. ఆపై ఇంటిలోని రూ.1.60 లక్షల నగదును ఎత్తుకెళ్లిపోయారు. డబ్బు ఆశతోనే శివకు రామకృష్ణ సహకారం అందించారు. హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా వారి అంత్యక్రియల్లో కూడా ఈ నిందితులు పాల్గొన్నట్టు జిల్లా ఎస్పీ విజయరావు వివరించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, 15 రోజుల్లో చార్జిషీటు దాఖలుచేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments