Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న ప్రేమ కోసం... తనువు చాలించిన తమ్ముడు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (11:20 IST)
నెల్లూరు జిల్లాలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. అన్న ప్రేమ కోసం తమ్ముడు తనువు చాలించాడు. అన్న ప్రేమించిన యువతిని తీసుకొచ్చేందుకు వెళ్లిన తమ్ముడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువతి కూడా ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లా బిట్రగుంట వద్ద జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరి గ్రామానికి చెందిన కాకార్ల నాదముని అలియాస్ నిరంజన్, రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన ఓ యువతిలకు ఒక యేడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు వేరే పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం చేయబోతున్నారని నిరంజన్‌కు యువతి సమాచారం చేరవేసింది. తాను రాలేనని, తన తమ్ముడైన కాకర్ల దేవేంద్ర(22)ను పంపిస్తున్నానని.. అతనితో వచ్చేయమని చెప్పారు. దీంతో దేవేంద్ర... హుకుంపేటకు వెళ్లి ఆ యువతిని తీసుకుని నంబర్ ప్లేట్ లేని స్కూటీలో స్వగ్రామానికి బయలుదేరాడు. 
 
మార్గమధ్యలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద జాతీయ రహదారి ఆకాశవంతెన సమీపంలో నిద్రమత్తులో ఉన్న దేవేంద్ర రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి 108కు సమాచారమిచ్చారు. వాహనంలో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. యువతి చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments