Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నెల్లూరు చేపల పులుసు' వంట ఛాలెంజ్‌ను స్వీకరించిన చెర్రీ

Advertiesment
Anushka, naveen
సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి". శుక్రవారం విడుదలకానుంది. ఈ చిత్రంలో అనుష్క ఒక చెఫ్ పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను చాలా వెరైటీగా చేపట్టారు. రెసిపీ ఛాలెంజ్ పేరుతో కొత్త ఛాలెంజ్‌ను మొదలుపెట్టింది. తనకు ఇష్టమైన చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్‌కు ఛాలెంజ్ విసిరింది. తనకు ఇష్టమైన వంటకాన్ని తయారు చేసి అందరితో పంచుకున్నానని, ఇపుడు ఈ సవాల్‌ను ప్రభాస్‌కు విసురుతున్నట్టు చెప్పింది. 
 
ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్.. తనకు రొయ్యల పులావ్ అంటే చాలా ఇష్టమంటూ వెల్లడించి, దాన్ని ఎలా తయారు చేయాలో వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్‌కు ఛాలెంజ్ విసిరాడు. దీనిపై చెర్రీ కూడా స్పందించాడు. తనకు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. దాని తయారీ విధానాన్ని వివరించాడు. ఆ తర్వాత మరో హీరో రానా దగ్గుబాటికి తదుపరి సవాల్ విసిరాడు. అలాగే, శుక్రవారం రిలీజ్ అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్కి 2898Kలో ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ