Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవూరులో కల్వర్టును ఢీకొన్న కారు... మామ - కోడలు మృతి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (10:42 IST)
నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురించి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నెల్లూరులోని హరినాథపురానికి చెందిన పార్లపల్లి మహేంద్ర తన కుటుంబంతో కలిసి కుమారుడిని తూర్పు గోదావరి జిల్లా తునిలో ఉన్న హాస్టల్‌లో చేర్పించి తిరుగు పయనమయ్యారు. 
 
ఈ క్రమంలో కోవూరులోని ఏసీసీ కల్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న మహేంద్ర తండ్రి పార్లపల్లి సుధాకర్‌రావు(76), భార్య అపర్ణ(35) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
ఈ ప్రమాదంలో మహేంద్రతో పాటు అతడి తల్లి వెంకట సుజాత, కూతురు సిసింద్రి(6) గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments