Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కోసం న్యాయపోరాటం.. కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ లీగల్ టీమ్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (20:33 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు న్యాయకోవిదులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ్ లూథ్రా చంద్రబాబు తరపున హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇపుడు టీడీపీ లీగల్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. 
 
చంద్రబాబు తరపున టీడీపీ లీగ్ టీమ్ న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని నిశితంగా పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందికదా అని ప్రశ్నించారు. అయితే, కస్టడీ పిటిషన్‌కు, బెయిల్ పిటిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది సబ్బారావు స్పష్టం చేశారు. 
 
ఆ తర్వాత ఆ పిటిషన్‌ను అనుమతించిన న్యాయమూర్తి ఏపీ సీఐడీకి నోటీసులు జారీ చేశారు. కాగా, ఇప్పటికోసం హౌస్ కస్టడీ కోసం, వైకాపా బనాయించిన ఇతర కేసుల్లో బెయిల్ కోసం మాత్రమే ఏసీబీ, హైకోర్టుల్లో పిటిషన్లను బాబు తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. ఈ క్రమంలో తొలిసారి చంద్రబాబు కోసం బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని స్వీకరించిన కోర్టు.. సీఐడీకి నోటీసులు ఇవ్వడం అంటే కీలక పరిణామంగా పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments