Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్ అడ్డానా? కేంద్రమంత్రి ఏమన్నారు?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (09:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడేళ్ళ కాలంలో గంజాయి అక్రమ రవాణా ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా, మూడు రెట్లు పెరిగింది, గత యేడాది కాలంలోనే ఏకంగా లక్ష కేజీల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.
 
టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఓ ప్రశ్న వేశారు. ఏపీలలో గతంలో ఎన్నడూ లేనంతగా గంజాయి పట్టుబడుతుందని, ఈ అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు చేపట్టారంటూ ప్రశ్నించారు. దీనికి హోం శాఖ సహాయ మంత్రి నిత్యాంద రాయ్ మాట్లాడుతూ, ఏపీలో స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం గత మూడేళ్ళలో భారీగా పెరిగిందని తెలిపారు. 
 
2018 సంవత్సరంలో 33930 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా, 2019లో ఇది రెండింతలై 66665.5 కేజీలకు చేరిందన్నారు. గత యేడాది ఏకంగా 106642.7 కేజీలకు చేరిందన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు చేపట్టకుండా ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ సాగుకు అడ్డుకట్ట పడటం లేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments