Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీల్లో హెచ్ఐవీ(ఎయిడ్స్) టెస్టులు చేయండి : త్రిపుర సీఎం ఆదేశం

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (09:47 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ తాజాగా కీలక ఆదేశాలు జారీచేశారు. అవసరమైతే, తప్పనిసరి అనుకుంటే రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో హెచ్.ఐ.వి లేదా ఎయిడ్స్ టెస్టులు చేయాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఇటీవలి కాలంలో త్రిపుర రాజధాని అగర్తలాలో అధిక సంఖ్యలో హెచ్.ఐ.వి కేసులు నమోదవుతున్నాయి. ఈ బాధితుల్లో విద్యార్థులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ ఈ తరహా ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో హెచ్ఐవీ పరీక్షలు చేయాలని, డ్రగ్స్ మూలాలు గుర్తించాలని రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. 
 
ఇటీవలి కాలంలో ఈ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం కూడా పెరిగింది. దీంతో విద్యార్థులు దురాలవాట్లకు బానిసలవుతున్నారు. డ్రగ్స్ మత్తులో విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ముఖ్యంగా, సురక్షితం కాని శృంగారంలో పాల్గొనడం వల్ల ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అగ్రర్తలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు కనీసం రెండు మూడు ఎయిడ్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ ఈ తరహా ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments