నయీమ్ అంత పనిచేశాడా.. ఒక్కొక్కరికి తులం బరువున్న బంగారు చైన్లు.. అహేలా బేగంకు..?
గ్యాంగ్స్టర్ నయీం ఆగడాలు ఒక్కొక్కటీ వెలుగులో వస్తున్నాయి. తన సోదరిని తిట్టాడనే కోపంతో నయీమ్ ఓ రౌడీషీటర్ను చంపించాడు. నల్లగొండలో నివసించే నయీం సోదరి సెటిల్మెంట్లు చేసేది. ఈ క్రమంలో యూసుఫ్ అనే రౌడీషీ
గ్యాంగ్స్టర్ నయీం ఆగడాలు ఒక్కొక్కటీ వెలుగులో వస్తున్నాయి. తన సోదరిని తిట్టాడనే కోపంతో నయీమ్ ఓ రౌడీషీటర్ను చంపించాడు. నల్లగొండలో నివసించే నయీం సోదరి సెటిల్మెంట్లు చేసేది. ఈ క్రమంలో యూసుఫ్ అనే రౌడీషీటర్కు మధ్య ఆధిపత్య పోరు చోటుచేసుకుంది. ఈ సందర్భంలో యూసుఫ్ ఆమెను తిట్టాడు. దాంతో నయీమ్ అతనిని చంపేశాడు. నయీం సూచన మేరకు టమాట శ్రీను రంగంలోకి దిగాడు.
ఫిబ్రవరిలో నయీమ్ గ్యాంగ్ యూసు్ఫ్ను చంపేసింది. శ్రీను గ్యాంగ్ జైలు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత ద్విచక్ర వాహనాలు లేవని, ఇబ్బందిగా ఉందని నయీంకు చెప్పడంతో గ్యాంగ్స్టర్ అందరికీ ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేశాడు. కానుకలుగా బంగారు చైన్లు, బైక్లు హతమైన తన తమ్ముడు అలీమొద్దీన్ కూతురు అహేలా బేగం నిశ్చితార్థాన్ని నిరుడు జూలై 24న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నయీం ఘనంగా నిర్వహించాడు. ఈ ఫంక్షన్లో అతిథులు ఒక్కొక్కరికి తులం బరువున్న బంగారం చైన్లను బహూకరించాడు.
ఆ రోజు వందకుపైగానే చైన్లు అందజేసినట్లు పోలీసు కస్టడీలో ఉన్న తబ్రేజ్ తల్లి అస్మత్ తాజ్ చెప్పినట్లు సమాచారం. మరికొందరికి ద్విచక్ర వాహనాలు ఇచ్చాడు. సమీప బంధువు, నల్లగొండకు చెందిన వరుడు తబ్రేజ్ను ఖుషీ చేసేందుకు స్విఫ్ట్ డిజైర్ కారు, బంగారు గొలుసు, రెండు ఉంగరాలు, నల్లగొండ శివారు పర్వతగిరిలో తాను ఆక్రమించిన గెస్ట్ హౌస్ను కానుకగా నయీం ఇచ్చాడు. నల్లగొండ సమీపంలోని పగిడిపల్లిలో ఉన్న భూమిని తబ్రేజ్కు పెళ్లి కానుకగా ఇచ్చినట్లు విచారణలో తేలింది.