Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరి జలాల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు.. బెంగళూరులో 144 సెక్షన్..

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే సుప్రీం కోర్టు రోజుకి తమిళనాడుకి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని ఆదేశించింది. కర్ణాటక మాత్రం రోజుకి 3 వేల

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (10:22 IST)
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే సుప్రీం కోర్టు రోజుకి తమిళనాడుకి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని ఆదేశించింది. కర్ణాటక మాత్రం రోజుకి 3 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తామని.. కావేరిలోనే నీరు లేనప్పుడు వారికి మాత్రం ఎలా విడుదల చేయాలని సీఎం సిద్ధరామయ్య సైతం ఫైర్ అయ్యారు. 
 
ఇప్పుడు కావేరీ జలాలను తమిళనాడుకు ఈనెల 23వ తేది వరకు వదిలేది లేదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల 23వ తేది తరువాత ఉభయ సభల్లో ఈ విషయం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతిని కలుస్తామని.. ఆరోజు కావేరీ జలాల పంపిణిపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
కావేరి జలాల వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో బెంగళూరులో మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఆదేశాలు ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి వరకూ అమల్లో వుంటాయి. కాగా, రోజుకి 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలన్నది సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు. 28, 29 తేదీల్లో తమిళనాడుకు నీటిని విడుదల చేసేందుకు వీలుగా రిజర్వాయర్లను తెరిచి ఉంచాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments