Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసాపురం ఎంపీడీవో అదృశ్యం.. ఏలూరు కాల్వలో మృతదేహం

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (13:49 IST)
నరసాపురం ఎంపీడీవో అదృశ్యం వ్యవహారం విషాదాంతమైంది. జూలై 16న అదృశ్యమైన ఎంపీడీవో మృతదేహాన్ని విజయవాడ శివార్లలో ఏలూరు కాల్వలో గుర్తించారు. నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు జూలై 15 నుంచి కనిపించకుండా పోయారు.

అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గత బుధవారం (జూలై 17)న ఆదేశించారు. ఏలూరు కాల్వలో వెంకటరమణ దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
మొబైల్‌ సిగ్నల్‌ను ట్రాక్‌ చేయడంతో విజయవాడలోని మధురానగర్‌ ఏలూరు కాల్వ వద్ద సిగ్నల్‌ కట్‌ అయినట్లు గుర్తించారు. దీంతో గత వారం రోజులుగా ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మధురానగర్ ఫ్లై వంతెన పిల్లర్‌కు చిక్కుకున్న మృతదేహాన్ని గుర్తించారు. వంతెనపై నుంచి దూకిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలోనే మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసిఎంపీడీవో కుమారులు, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments