Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా నేత కొడాలి నాని మాజీ పీఏపై దాడి.. తలకు తీవ్ర గాయం

Advertiesment
knife

వరుణ్

, మంగళవారం, 23 జులై 2024 (10:44 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన అచంట లక్ష్మోజీపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తలకు బలమైన గాయం తగిలింది. సోమవారం రాత్రి ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన మచిలీపట్న కలెక్టరేట్‌‍లో పౌరసరఫరాల విభాగంలో పని చేస్తున్నారు. సోమవారం విధులు ముగించుకుని రైలులో గుడివాడకు వచ్చాడు. స్టేషన్ పక్కనే ఉన్న తన బైకును తీస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. 
 
తనపై దాడి చేసింది తనకు తెలియదని లక్ష్మోజీ చెబుతున్నాడు. అయితే, వైద్యం కోసం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చేరకుండా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతనిపై దాడి వ్యక్తిగత కారణాలా లేక రాజకీయ కక్షల కారణంగా జరిగిందా అనేది తెలియాల్సివుంది. ఈ దాడి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే గుడివాడకు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే ట్రాక్‌పై పడిన కుమార్తెలు.. కాపాడిన టెక్కీ... చివరికి ఏమైందంటే?