Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు అడ్డంకులు సృష్టిస్తారు.. తస్మాత్ జాగ్రత్త.. నారా లోకేశ్

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2023 (12:10 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నుంచి ప్రారంభించనున్న వారాహి నాలుగో విడత విజయ యాత్రకు అధికార వైకాపా నేతలు, శ్రేణులు ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని అందువల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జనసేనతో కలిసి పార్టీ శ్రేణులు పని చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ట్వీట్ చేశారు. 
 
"రేపటి నుంచి ప్రారంభం అయ్యే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని కోరుతున్నాను" అని పిలుపునిచ్చారు. 
 
మరోవైపు  వారావి విజయ యాత్రకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత, సినీ హీరో బాలకృష్ణ ప్రకటించారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేయనపుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments