Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డీ.. చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం : వైకాపాకు నారా లోకేశ్ హెచ్చరిక

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (20:08 IST)
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార వైకాపా నేతలు చేస్తున్న దాడులపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే వడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. 
 
వాహనాల కొనుగోలు కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జేసీ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 
 
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. జగన్‌ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు.
 
జేసీ కుటుంబానికి ట్రావెల్స్‌ వ్యాపారం కొత్తకాదని తెలిపారు. 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్‌.. ఏపీ ప్రజలందరితో చిప్పకూడు తినిపించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. తొందర్లోనే తిరగబడే రోజు వస్తుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభాకర్‌ రెడ్డిపై ఫిబ్రవరి నుంచి 22 కేసులు పెడుతూ వచ్చారన్నారు. జేసీ ప్రభాకర్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments