Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తుపెట్టుకోండి.. ఏ ఒక్కడినీ వదిలిపెట్టను : నారా లోకేశ్ వార్నింగ్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (13:59 IST)
అధికార వైకాపా నేతలకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి.. ఏ ఒక్కరినీ వదలిపెట్టబోనని హెచ్చరించారు. మాజీ మంత్రి వైఎస్ వివేనంద రెడ్డి హత్య తర్వాత తమ పార్టీ అధినేత చంద్రబాబుపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. తమపై అసత్య కథనాలు ప్రచురించారన్నారు. 
 
సాక్షి దినపత్రికపై నారా లోకేష్ రూ.75 కోట్ల పరువు నష్ట దావా వేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన గురువారం విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవురు నష్టం దావాకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కోర్టుకు వచ్చాను. నేను దావా వేసినప్పటికీ వాళ్లు కావాలనే ఆలస్యం చేస్తున్నారు. కానీ, న్యాయమూర్తి ఎట్టిపరిస్థితుల్లోనూ 28వ తేదీ నాటికి కౌంటర్ వేయాలని వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. 
 
ముఖ్యంగా, నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచే సాక్షి మీడియా తనపై దాడి చేస్తుందన్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి నాపై బురద జల్లింది. 2019లో అక్టోబరులో "చినబాబు చిరుతిండి 25 లక్షలండి" అనే శీర్షికతో సాక్షిలో ఒక కథనాన్ని ప్రచురించింది. దాన్ని చూసి మరో ఆంగ్లపత్రిక, మరో నేషనల్ మ్యాగజైన్ ఈ కథనాన్ని ప్రచురించింది. 
 
వీళ్ళ ముగ్గురికి నేను నోటీసులు జారీచేశాను. ఆ తర్వాత మ్యాగజైన్ క్షమాపణలు కోరింది. కానీ, సాక్షిగానీ, మరో పత్రికగానీ ఎక్కడా వివరణ ఇవ్వలేదు. నేను ఈ విషయంపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్లు దాన్ని ప్రచురించలేదు. అందుకే నేను సాక్షిపై పరువు నష్టం దావా వేసినట్టు చెప్పారు. అంతేకాకుండా, తమను, తమ పార్టీ కార్యర్తలు, నేతలను టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments