Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్... నేడు సీఐడీ విచారణకు

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (11:21 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అవినీతి జరిగిందంటూ అధికార వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారా లోకేశ్ ఏ14గా ఉన్నారు. దీంతో ఆయన వద్ద విచారణ జరిపేందుకు సీఐడీ నిర్ణయించి, నోటీసు జారీచేసింది. తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ అందులో పేర్కొంది. మరోవైపు, దీంతో ఆయన సీఐడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 
 
కావాల్సిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చడం కోసం రింగ్ రోడ్డు అలైన్మెంట్‌ను ఉద్దేశ్యపూర్వకంగా మార్చారనే అభియోగాలను ఈ కేసులోని నిందితులపై సీఐడీ మోపింది. ఈ కేసులో ఏ14గా ఉన్న లోకే‌శ్‌కు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 
 
అయితే, లోకేశ్‌ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశారు జారీ చేసింది. విచారణ సమయంలో ఆయన తరపు న్యాయవాదిని కూడా అనుమతించాలని ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారుల ఎదుట లోకేశ్ హాజరుకానున్నారు. మరోవైపు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments