అమరావతి రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్... నేడు సీఐడీ విచారణకు

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (11:21 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అవినీతి జరిగిందంటూ అధికార వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారా లోకేశ్ ఏ14గా ఉన్నారు. దీంతో ఆయన వద్ద విచారణ జరిపేందుకు సీఐడీ నిర్ణయించి, నోటీసు జారీచేసింది. తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ అందులో పేర్కొంది. మరోవైపు, దీంతో ఆయన సీఐడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 
 
కావాల్సిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చడం కోసం రింగ్ రోడ్డు అలైన్మెంట్‌ను ఉద్దేశ్యపూర్వకంగా మార్చారనే అభియోగాలను ఈ కేసులోని నిందితులపై సీఐడీ మోపింది. ఈ కేసులో ఏ14గా ఉన్న లోకే‌శ్‌కు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 
 
అయితే, లోకేశ్‌ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశారు జారీ చేసింది. విచారణ సమయంలో ఆయన తరపు న్యాయవాదిని కూడా అనుమతించాలని ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారుల ఎదుట లోకేశ్ హాజరుకానున్నారు. మరోవైపు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments