మూడు నెలల్లో అధికారంలోకి వస్తాం.. ప్రతీకారం తీర్చుకుంటాం..?

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (10:08 IST)
దాదాపు రెండున్నర నెలల తర్వాత టీడీపీ అధినేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. సోమవారం నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. సెప్టెంబర్ 9న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ కారణంగా లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. ఇప్పటి వరకు 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతోంది. రెండున్నర నెలల తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. 
 
యువగళం పాదయాత్ర 210వ రోజు రాజోలు నియోజకవర్గం పొదలాడ క్యాంపు సైట్ నుండి ప్రారంభమైంది. పాదయాత్ర పున:ప్రారంభం సందర్భంగా పొదలాడకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజు నుంచే తనను అడ్డుకునేందుకు జగన్ స్కెచ్‌2లు వేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. 
 
చంద్రబాబును అరెస్ట్ చేసి యువగళం పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబుని చూస్తేనే సైకో భయపడతాడు. అందుకే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.  వచ్చే మూడు నెలల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని లోకేష్ ప్రకటించారు. 
 
రాజారెడ్డి రాజ్యాంగాన్ని ధ్వంసం చేశారని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు నారా లోకేష్. టీడీపీ కార్యకర్తలను వేధించిన వైసీపీకి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు నారా లోకేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ లాంటి పర్సన్ మహిళలకు బ్లెస్సింగ్ అనుకోవాలి : రశ్మిక మందన్న

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

SSMB29 చిత్రంలో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్, గన్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments