Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూలో వైకాపా... ఆక్సిజన్ ఇస్తున్న బీజేపీ : నారా లోకేశ్

వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని సారథ్యంలోని వైకాపా ఐసీయూలో ఉందనీ, దానికి భారతీయ జనతా పార్టీ ఆక్సిజన్ అందిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. విజయవాడలో

Webdunia
సోమవారం, 28 మే 2018 (14:32 IST)
వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని సారథ్యంలోని వైకాపా ఐసీయూలో ఉందనీ, దానికి భారతీయ జనతా పార్టీ ఆక్సిజన్ అందిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని, కేసుల మాఫీ కోసం వైసీపీ పాట్లు పడుతోందన్నారు.
 
కొందరు వ్యక్తులు కొన్ని శక్తుల ప్రోద్భలంతో తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను తప్పు చేసినట్టు ఏ ఒక్క చిన్నపాటి ఆధారం ఉన్నా తక్షణం బహిర్గతం చేయాలని ఆయన సవాల్ విసిరారు. అలాగే, ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. అవేమీ చూడకుండా ఉద్దానానికి ఏమీ చేయలేదనడం సరికాదని, కిడ్నీ వ్యాధి ప్రబలిన చోట ఆర్వోసీ ప్లాంట్లు ఏర్పాటుచేశామని లోకేష్ వెల్లడించారు. 
 
ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించి... మళ్లీ చంద్రబాబును గెలిపించాలని మహానాడులో మంత్రి లోకేశ్‌ పిలుపు ఇచ్చారు. తిరుపతి వెంకన్న పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, శ్రీవారి జోలికి వెలితే మాడి మసైపోతారన్నారు. రూ.162 కోట్లతో 1750 పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. 17 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశామని మంత్రి వివరించారు. ఉపాధి హామీలో అవినీతి జరుగుతోందని అసత్యప్రచారం చేస్తూ.. కేంద్రం నుంచి నిధులు రాకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారని లోకేశ్‌ ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments