Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువగళం పాదయాత్ర మళ్లీ వాయిదా... ఎందుకంటే...

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (15:59 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి నుంచి పునఃప్రారంభించనున్న యువగళం పాదయాత్రను వాయిదా పడింది. తన తండ్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‍‌పై అక్టోబరు మూడో తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. దీంతో యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్యనేతల సూచన మేరకు వాయిదా వేసుకున్నారు. 
 
స్కిల్ డెవలప్‌‍మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఉన్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్రను నిలిపివేసిన విషయం తెల్సిందే. దాదాపు 20 రోజుల తర్వాత ఈ నెల 29వ తేదీ శుక్రవారం రాత్రి 8.15 గంటలకు తిరిగి పునఃప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, అక్టోబరు 3వ తేదీన సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనున్న నేపథ్యంలో తన పాదయాత్రను వాయిదా వేశారు. 
 
కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తీసుకొచ్చి పార్టీ అధినేత చంద్రబాబుని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నందున ఢిల్లీ  న్యాయవాదులతో లోకేశ్ సంప్రదింపులు చేయాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులు సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. అందుకే ఈ పాదయాత్రను వాయిదా వేశారు., త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పునఃప్రారంభ తేదీని ప్రకటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments