Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ గుడ్ న్యూస్, 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితం

ఐవీఆర్
సోమవారం, 10 మార్చి 2025 (21:51 IST)
ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎయిమ్స్, పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చిందనీ, అందువల్ల మెగా ఇంజినీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి తన విజ్ఞప్తి మేరకు 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితంగా అందించినట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
 
'' ఈరోజు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను ప్రారంభించాను. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. నా విజ్ఞప్తి మేరకు మెగా ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి రూ.2.4 కోట్ల విలువైన రెండు ఒలెక్ట్రా బస్సులను ఉచితంగా అందించింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు, మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు ఉచితంగా ప్రజలకు సేవలు అందిస్తాయి.''

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments