Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేశారు : నారా లోకేశ్ ధ్వజం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (15:28 IST)
సీఎం జగన్ రెడ్డి తన చేతిగాని పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో తొమ్మిదో తరగతి చదివే బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. 
 
అలాగే, కాకినాడ జిల్లాలో వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం శవమై తేలాడు. ఈ శవాన్ని తన కారులోనే మృతుని ఇంటికి ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తీసుకెళ్లి అప్పగించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
అర్థరాత్రి పూట రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పిన ఎమ్మెల్సీ స్వయంగా ఆయనే తన కారులో తెల్లవారుజామున 2 గంటలకు డ్రైవర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. డ్రైవర్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో బాడీని అక్కడే వదిలేసి మరో కారులో అనంత ఉదయ్ బాబు వెళ్లిపోయారు. ఈ రెండు ఘటనపై నారా లోకేశ్ స్పందించారు. ఏపీలో బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయన్నారు. 
 
వైకాపా నాయకుల నేరాలు, ఘోరాలకు సామాన్యులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన వద్ద డ్రైవరుగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments