Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేశారు : నారా లోకేశ్ ధ్వజం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (15:28 IST)
సీఎం జగన్ రెడ్డి తన చేతిగాని పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో తొమ్మిదో తరగతి చదివే బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. 
 
అలాగే, కాకినాడ జిల్లాలో వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం శవమై తేలాడు. ఈ శవాన్ని తన కారులోనే మృతుని ఇంటికి ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తీసుకెళ్లి అప్పగించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
అర్థరాత్రి పూట రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పిన ఎమ్మెల్సీ స్వయంగా ఆయనే తన కారులో తెల్లవారుజామున 2 గంటలకు డ్రైవర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. డ్రైవర్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో బాడీని అక్కడే వదిలేసి మరో కారులో అనంత ఉదయ్ బాబు వెళ్లిపోయారు. ఈ రెండు ఘటనపై నారా లోకేశ్ స్పందించారు. ఏపీలో బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయన్నారు. 
 
వైకాపా నాయకుల నేరాలు, ఘోరాలకు సామాన్యులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన వద్ద డ్రైవరుగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments