Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానాడులో మంత్రి లోకేష్ ఏం మాట్లాడారు... అహ ఏం మాట్లాడారా అని?

వచ్చే ఎన్నికల్లో బిజెపికి రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా రాబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే… ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌ మాత్రం రానున్న ఎన్నికల్లో బిజెపినే తమ ప్రధాన ప్రత్యర్థి అని అంటున్నారు. ఈ రెండు మాటలూ మహానాడు వేదికపైన మాట్లాడినవే. ఒ

Webdunia
మంగళవారం, 29 మే 2018 (14:32 IST)
వచ్చే ఎన్నికల్లో బిజెపికి రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా రాబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే… ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌ మాత్రం రానున్న ఎన్నికల్లో బిజెపినే తమ ప్రధాన ప్రత్యర్థి అని అంటున్నారు. ఈ రెండు మాటలూ మహానాడు వేదికపైన మాట్లాడినవే. ఒక్కశాతం ఓట్లు కూడా రాని బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయితే…. మరి వైసిపికి ఎన్ని ఓట్లు వస్తాయి? పవన్‌కు, కాంగ్రెస్‌కు, వామపక్షాలకు ఎన్ని ఓట్లు వస్తాయి? ఈ లెక్కన ఓట్లన్నీ టిడిపికే వస్తాయన్నమాట. 
 
లోకేష్‌ మాట్లాడిన మాటల్లో ఎక్కడా లాజిక్‌ లేదనే చర్చయితే సాగుతోంది. వైసిపి ఐసియులో ఉందని, దానికి బిజెపి ఆక్సిజన్‌ అందిస్తోందని చెప్పారు. ఆ వెంటనే వైసిపికి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని అన్నారు. అదేవిధంగా బిజెపి సొంతంగా ఏమీ చేయలేక కొత్త నటులను, కుల సంఘాలను తెస్తోందని మరోమాట అన్నారు. 
 
లోకేష్‌ ఉపన్యాసంలో ఈ గందరగోళం ఏమిటో అర్థంకావడంలేదంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. వైసిపి, బిజెపిలను విమర్శించే క్రమంలో లోకేష్‌ గందరగోళానికి గురవుతున్నారని అంటున్నారు. లోకేష్‌ చెప్పింది నమ్మాలంటే చంద్రబాబు చెప్పింది తప్పవుతుంది. చంద్రబాబు చెప్పింది సరైనదైతే లోకేష్‌ మాటలు అసంబద్ధమవుతాయి. ఉపన్యాసాల్లో లోకేష్‌కు ఇంకా శిక్షణ అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments