Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాసనమండలిలో తలపండిన నేతల కాదు.. సీన్ మారింది.. కరణం-నారా లోకేష్‌ల ఎంట్రీ

ఏపీ అసెంబ్లీ ఆవరణలో టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆసక్తికర చర్చ సాగింది. కార్యాలయంలో సీనియర్ నేతలు కరణం బలరాం, పయ్యావుల కేశవ్‌ల మధ్య శాసనమండలిపై చర్చ సాగింది. గతంలో శాసనమండలి అంటేనే తలపండిన సీనియర్ న

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (10:11 IST)
ఏపీ అసెంబ్లీ ఆవరణలో టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆసక్తికర చర్చ సాగింది. కార్యాలయంలో సీనియర్ నేతలు కరణం బలరాం, పయ్యావుల కేశవ్‌ల మధ్య శాసనమండలిపై చర్చ సాగింది. గతంలో శాసనమండలి అంటేనే తలపండిన సీనియర్ నేతలకు పరిమితమైన సభగా పేరుంది. అందుకే దీన్ని పెద్దల సభ అని పిలిచేవారు.

అయితే ప్రస్తుతం సీన్ మారింది. సీనియర్లుండే మండలిలో ఇక యువ నాయకులు కూడా ఎంట్రీ ఇస్తున్నారని కరణం బలరాం, పయ్యావుల కేశవ్ మాట్లాడుకున్నారు. కాగా, 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన కరణం బలరాం.. ఇటీవలే శాసనమండలికి ఎన్నికైన ఆయన మార్చి 30న సభలో అడుగుపెడుతున్నారు.
 
అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈయన కూడా మండలిలో అడుగుపెట్టనున్నారు. తద్వారా ఎమ్మెల్సీగా నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం 2017లో మొదలవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే 1978 బ్యాచ్‌ మొదలుకుని 2017 బ్యాచ్‌ నాయకుల వరకు సభ్యులుగా ఉన్నారని పయ్యావుల వ్యాఖ్యానించారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments