Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" యాత్ర

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (09:20 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో అనేక మంది టీడీపీ కార్యకర్తలు గుండెలు ఆగిపోయి చనిపోయారు. వీరి కుటుంబాలను ఓదార్చే నిమిత్తం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుంచి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నారు. 
 
'నిజం గెలవాలి' పేరిట నిర్వహించే ఈ యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుందని, ఇందుకోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో మూడు రోజుల పాటు సాగుతుంది. భువనేశ్వరి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం నారావారిపల్లెకు చేరుకుని కులదేవతలకు పూజలు నిర్వహించడం తెలిసిందే.
 
'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. 'నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను, ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను' అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments