Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" యాత్ర

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (09:20 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో అనేక మంది టీడీపీ కార్యకర్తలు గుండెలు ఆగిపోయి చనిపోయారు. వీరి కుటుంబాలను ఓదార్చే నిమిత్తం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుంచి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నారు. 
 
'నిజం గెలవాలి' పేరిట నిర్వహించే ఈ యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుందని, ఇందుకోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో మూడు రోజుల పాటు సాగుతుంది. భువనేశ్వరి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం నారావారిపల్లెకు చేరుకుని కులదేవతలకు పూజలు నిర్వహించడం తెలిసిందే.
 
'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. 'నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను, ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను' అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments