Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎలాంటిదాన్నో నా భర్త నమ్మితే చాలు.. నారా భువనేశ్వరి ఉద్వేగం

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (21:57 IST)
ఒక స్త్రీగా నేను ఎలాంటిదాన్నో ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదనీ నా భర్త నమ్మితే చాలు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. నేను ఇలాంటిదాన్ని, అలాంటిదాన్ని అంటూ ఇష్టారీతిన కొందరు మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తనకు మనస్సాక్షి ఉందని, వేరేవాళ్లు ఏం వాగినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. స్త్రీలందరికీ తాను అదే సందేశం ఇవ్వాలనుకుంటున్నానని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెప్పారు. 
 
నేను ఒక స్త్రీనేండి. నాకు జరిగింది నేను ఎప్పుడూ మరిచిపోను. ఏంటి నా మీద చూపిస్తారు. నేను ఇట్లాంటిదాన్ని, అట్లాంటిదాన్ని అని. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అది మా ఆయన నమ్మితే చాలు. వేరేవాళ్లు ఏం వాగినా అది మనకు అనవసరం. ఇక్కడ ఉండే స్త్రీలందరికీ నేను అదే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మగాడు ఏదైనా మాట్లాడుతాండండీ.. అదేం పట్టించుకోవద్దు. అది పనిలేని వాళ్లు అట్లాగే వాగుతారు. వారు మరిచిపోతున్నారు. ఒక ఆడది తల్లి, భార్య అని. ఈ సృష్టికి మూలకర్త ఆడది అనే విషయం వారు మరిచిపోయారు అని ఉద్వేగంతో మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments