శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజుల పాటు పవిత్రోత్సవాలు

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (21:45 IST)
సుప్రసిద్ధ శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజుల వార్షిక ప్రవిత్రోత్సవం జరుగుతుంది. మొదటి రోజైన మంగళవారం ఆలయంలోని గురు దక్షిణామూర్తి ముందు ప్రత్యేక పేటికలో 'శ్రీ' సాలీడు, 'కాళ' పాము, 'హస్తి' ఏనుగుల విగ్రహాలు, భరద్వాజ మహర్షి విగ్రహాలను ఉంచి వివిధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. ఇంకా ప్రత్యేక అభిషేకం, అలంకరణ జరిగింది. 
 
అనంతరం దీపారాధన నిర్వహించారు. అలాగే మూలవిరాట్టు శ్రీ కాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబికా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. 
 
అలాగే సంప్రోక్షణ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల చైర్మన్ అంజూరు తారక శ్రీనివాస్‌, పరిపాలనాధికారి సాగర్‌బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సతీమణి, కుమార్తె, భక్తులు పాల్గొన్నారు. ఈ పవిత్రోత్సవం 29వ తేదీ వరకు జరగనుంది. 
 
పవిత్రోత్సవం రోజులలో, మూడు కాలాల అభిషేకం, సాయంత్రం 6 గంటలకు ప్రదోష దీపారాధనను మాత్రమే ఆలయం నిర్వహిస్తుంది. భక్తులకు దీపారాధన టిక్కెట్లు, స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చే వీఐపీలు, ప్రముఖులకు పూర్ణ కుంభ స్వీకరణ టిక్కెట్లు ఇవ్వరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments