Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా భువనేశ్వరి ఆదేశంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు : సోమినాయుడు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:28 IST)
బెజవాడ కనకదుర్గ దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆదేశం మేరకు దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేశారని ఆరోపించారు. ఆమె ఆదేశం మేరకు అప్పటి ఈవో ఈ పూజలు అర్థరాత్రి నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అపుడు దేవాదాయ శాఖామంత్రిని మంత్రిని రాజీనామా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించిందా? అని ప్రశ్నించారు. కాగా, తన కుమారుడైన నారా లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే చంద్రబాబు నాయుడు ఈ తాంత్రిక పూజలు నిర్వహించారంటూ వైకాపా గతంలో ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
 
కాగా, ఇపుడు దుర్గగుడి రథానికి ఉన్న మూడు సింహాలు మాయమయ్యాయి. ఈ వ్యవహారం ఏపీలో పెను రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఈ సింహాలు మాయం కావడం వెనుక వైకాపా నేతలు హస్తంవుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోమి నాయుడు కౌంటరిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ- రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తర్వాతి కథనం
Show comments