Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌ను కలుస్తా.. బాలయ్య ఆసక్తికర కామెంట్స్

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (14:26 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని నందమూరి హీరో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. 
 
కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీఎం జగన్‌ను కలిసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికి.. పోరాటాన్ని విస్తృతం చేశారు బాలయ్య. శనివారం అఖిలపక్ష నేతలతో కలిసి.. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. 
 
ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా చేసేంతవరకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని ప్రకటించారు. అందుకోసం అవసరమైతే సీఎం జగన్‌‌ను కలుస్తానంటూ పేర్కొన్నారు.
 
సత్యసాయి జిల్లాకు తాము వ్యతిరేకం కాదని.. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు మీద ప్రేమతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయలేదని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ బాలకృష్ణ పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ రేప్ చేసే నాటికి ఆమెకు 16 ఏళ్లే.. కస్టడీ తీసుకుంటారా?

పవన్‌ కల్యాణ్‌తో విజయ దేవరకొండకు కొత్త కష్టం.. ఏంటది?

టాలీవుడ్‌ సినిమాలో విలన్ అవతారంలో రవీనా టాండన్?

జానీ మాస్టర్ ఇష్యూతో బన్నీకి, సుక్కూకు సంబంధం లేదు.. రవి

మా అన్నయ్య సూర్య నీకే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయ్.. అంటూ హగ్ చేసుకున్నారు : కార్తీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్న పొత్తులు తింటే ప్రయోజనాలు ఏమిటంటే?

సీగ్రమ్ యొక్క 100 పైపర్స్ ది లెగసీ ప్రాజెక్ట్‌‌తో ఇండియన్ కాలిగ్రఫీకి సరికొత్త జీవితం

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి, బాగా నిద్రపోవడానికి చిట్కాలు

వీటితో మధుమేహం అదుపులోకి, ఏంటవి?

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments