Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతకు సలహా ఇచ్చిన టాలీవుడ్ అగ్రహీరో

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (17:41 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రహీరోగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన అభిమానులతో పాటు యువతకు ఓ మంచి సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి చూస్తూ కాలం వృథా చేయకుండా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఆయన గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలోభాగంగా పలు ప్రాంతాల్లో స్థానికులకు కలివిడిగా మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. 
 
ఈ క్రమంలో హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఉన్నత పాఠశాల ఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలు ఉచితంగా ఎల్.ఈ.డి టీవీలను ఆయన ప్రధానం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు దేశానికి గుర్తింపు తెచ్చేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. హిందూపురంలో అంధుల పాఠశాల, నవోదయ స్కూల్ తెచ్చిన ఘనత దివంగత ఎన్.టి.రామారావుకు చెందుతుందన్నారు.
 
ముఖ్యంగా, విద్యార్థులు చదువులపై దృష్టిసారించాలని కోరారు. సోషల్ మీడియా వైపు వెళ్లకుండా మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు చూడాలని, ఫేస్‌బుక్ విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కనీసం మట్టితో అయినా ఒక్క గుంత పూడ్చిన పాపానపోలేదని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments