Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఆలోచనలన్నీ పేదల సంక్షేమం కోసమే : ఎమ్మెల్యే రోజా

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:56 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి ఆలోచన, తీసుకునే నిర్ణయం పేదల సంక్షేమం కోసమేనని ఆ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజా అన్నారు. ఆమె గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్ని సినిమాలకు ఒకే విధమైన టిక్కెట్ ధరలు ఉంటే పేద, మధ్యతరగతి ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల సినిమా టిక్కెట్ల ధరల విషయంలో వివాదం వద్దని కోరారు. 
 
ముఖ్యంగా, భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలే ఈ సినిమా టిక్కెట్లపై తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారని అన్నారు. టిక్కెట్ ధరలను తగ్గిస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకునేని ఆమె అన్నారు. 
 
అంతేకాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం ఆస్పత్రులను మెరుగుపరిచి, వైద్య సదుపాయాలు పెంచి సామాన్య ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments