Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జోహారు : నాగబాబు

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (07:49 IST)
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సంభవించిన కల్తీసారా మృతులపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. కల్తీ సారా మృతులను సహజ మరణాలుగా చిత్రీకరించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి జోహారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఆయన జంగారెడ్డి గూడెంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "డాక్టర్లు, మీడియా స్థానకుల మాదిరే నేను కూడా మొదట వీటిని కల్తీ సారా మరణాలే అని పరిగణించాను. కానీ మన జగన్ రెడ్డి గారు తన ప్రత్యేక డిక్షనరీ సాయంతో వీటిని సహజ మరణాలుగా ధృవీకరించడంతో ఊపిరి పీల్చుకున్నాను. 
 
అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారైనా, అందులో మరణించిన వారందరూ కేవలం మగవాళ్లే అయినా వీరందరూ తమ కంటి చూపులు కోల్పోయి, కడుపులోని అవయవాలన్నీ కోల్పోయి ఉన్నా అందరూ ఒకే విధంగా గంటల వ్యవధిలో హఠాన్మరణానికి గురైనా ఈ చావులకు కల్తీ సారాకు ఎలాంటి సంబంధం లేదని, ఇవన్నీ సహజ మరణాలుగా నిర్ధారించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి జోహారు. ఇలా ఇంకా ఎంతమంది చనిపోయినా మనం వీటిని కేవలం సహజ మారణాలుగా పరిగణించాల్సి రావడం ఆంధ్రులకు పట్టిన దుస్థితి" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments