Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్జరీ సంతకాలతో పంచాయతీ నిధులను వైకాపా నేతలు దోచుకున్నారు : పవన్‌కు ఫిర్యాదు

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (15:22 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ లక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. తన సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులను స్వాహా చేశారంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖామంత్రి పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. 
 
బుధవారం అసెంబ్లీలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి అసెంబ్లీకి వచ్చిన లక్ష్మి... పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని సోమిరెడ్డి వివరించారు. కాకాణితోపాటు పలువురు వైకాపా నేతలు తనపై దౌర్జన్యం చేశారని పవన్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారన్నారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన మంత్రి పవన్ కళ్యాణ్.. లక్ష్మి చేసిన ఫిర్యాదులకు సంబంధించి పూర్తి వివరాలు తన ముందు ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా లక్ష్మి కొనసాగుతున్నారు. తాను గిరిజనురాలిని కావడంతో మూడేళ్లుగా వైకాపా నేతలు, పంచాయతీ కార్యదర్శి ఇష్టానురీతిలో వేధించారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని, పంచాయతీ సర్పంచ్ తాను అయినప్పటికీ.. పెత్తనం, పాలన అంతా వైకాపా నేతలే కొనసాగించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments