Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీలాన్ని కాపాడుకునేందుకు భవనం పైనుంచి దూకేసింది...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (16:45 IST)
ఓ కామాంధుడు చెర నుంచి తన శీలాన్ని కాపాడుకునేందుకు ఓ మహిళ భవనంపై నుంచి కిందికి దూకేసింది. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన గుర్‌గ్రామ్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుర్‌గ్రామ్‌లోని బెలైర్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అజయ్ అశ్వాని అనే వ్యక్తి తన ఇంట్లో పనిచేసే మహిళపై కన్నేశాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ పదేపదే కోరిక తీర్చమని వేధించసాగాడు. అతని తీరుతో విసిగిపోయిన సదరు మహిళ అజయ్ భార్యకు విషయాన్ని చెప్పింది. అయితే భార్య మాటలు కూడా పెడచెవిన పెట్టాడు. ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు కదా.. మరింతగా రెచ్చిపోయాడు.
 
ఈ క్రమంలో గురువారం పనిచేసేందుకు తన ఇంటికి వచ్చిన మహిళను తన కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అడ్డూ అదుపు లేకపోయింది. చేయి పట్టుకుని లాగుతూ అత్యాచారానికి యత్నించాడు. అతని నుండి ఎలా తప్పించుకోవాలో అర్థంకాని అయోమయ స్థితిలో భవంతి కిటికీలోంచి దూకేసింది. 
 
ఆమె అరిచిన అరుపులు విని చుట్టుప్రక్కల వారు వచ్చారు. మొదటి అంతస్తులో నుండి దూకడంతో ప్రాణానికి ప్రమాదం ఏమీ జరగలేదు కానీ వెన్నుపూస, మోకాళ్లకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి. ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments